13న సౌఖ్యం పాటలు
కుటుంబంతో పాటు ఇరుగూపొరుగూ కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే హీరో కేరక్టరైజేషన్తో అల్లుకున్న కథే `సౌఖ్యం``` అని అంటున్నారు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. `యజ్ఞం` తర్వాత గోపీచంద్ హీరోగా ఆయన రూపొందిస్తున్న సినిమా `సౌఖ్యం`. `లౌక్యం` తర్వాత గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. రెజీనా నాయికగా నటిస్తోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ ``గోపీచంద్, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి పేర్లు వినగానే ఎవరికైనా `యజ్ఞం` సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాను మించేలా ఇప్పుడు `సౌఖ్యం` సినిమాను రూపొందిస్తున్నాం. టాకీ పూర్తయింది. మూడు పాటలను కూడా చిత్రీకరించాం. మిగిలిన రెండు పాటలను సోమవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరిస్తాం. దాంతో గుమ్మడికాయ కొడతాం. డిసెంబర్ 13న ఒంగోలులో వైభవంగా ఆడియో వేడుకను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మా గత చిత్రం `లౌక్యం` పాటలను విజయవాడలో ఘనంగా విడుదల చేశాం. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఒంగోలులో `సౌఖ్యం` పాటల వేడుకను నిర్వహిస్తాం. అన్ని వర్గాల వారినీ అలరించే సినిమా అవుతుంది. గోపీచంద్ మార్కు యాక్షన్కు, అందరినీ అలరించే ఎంటర్టైన్మెంట్ను జత చేసి శ్రీధర్ సీపాన మంచి కథను, అందుకు తగ్గ మాటలను రాశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం`` అని చెప్పారు.
0 comments:
Post a Comment