విష్ణు, రాజ్తరుణ్ ల చిత్రం ప్రారంభం
మంచు విష్ణు, సోనారిక, రాజ్తరుణ్, హెబ్బా పటేల్ నటీనటులుగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నం:5 చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. విష్ణుకి 'దేనికైనా రెడీ' వంటి సూపర్హిట్ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ టీవీ సమర్పణలో సుంకర రాంబ్రహ్మం నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి డా.మోహన్బాబు క్లాప్నివ్వగా, ఆయన సతీమణి నిర్మల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మంచు మనోజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ''నాగేశ్వరరెడ్డి మార్క్ కామెడీతో ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిది. సోమవారం నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని నిర్మాత తెలిపారు.
0 comments:
Post a Comment