గుణశేఖర్ కు కేవీ రెడ్డి అవార్డు
మూడు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి పేరు మీద యువకళావాహిని ఇస్తున్న 'కేవీ రెడ్డి’ అవార్డును దాసరి నారాయణరావు చేతుల మీదుగా గుణశేఖర్ అందుకున్నారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకలో దాసరి మాట్లాడుతూ- ‘‘గుణశేఖర్ గొప్ప క్రియేటర్. అతను తీసిన ‘సొగసు చూడ తరమా’ సినిమా చూసి సిగ్గుపడ్డా. అంత గొప్పగా తీశాడు.రాజీపడడం తనకు తెలియదు. అతను అనుకున్న దారిలో సక్సెస్ అవుతూ వచ్చాడు. అతని జీవితం ఒక ఎత్తయితే, ‘రుద్రమదేవి’ మరొక ఎత్తు. గుణశేఖర్ ఇంకా గొప్ప సినిమాలు తీయాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో నిర్మాతలు రమేశ్ప్రసాద్, అశ్వినీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, హరనాథ్రావు, దివాకర్బాబు, తోటప్రసాద్, సంగీత దర్శకుడు మణిశర్మ,నారాయణరావు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment