రెగ్యులర్ షూటింగ్ లో షీ
కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో 'మహేశ్వర ఆర్ట్స్ ' బ్యానర్ పై పర్స రమేష్ మహేంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం 'షీ ' (ఈజ్ వెయిటింగ్ ఉపశీర్షిక ) .శ్వేతమీనన్ 'షీ ' పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తెర వెనుక కథానాయకుల ఎంపిక పూర్తి అయ్యింది..ఈ సందర్భంగా చిత్రయూనిట్ 'ఆఫ్ స్క్రీన్ మూవీ టీమ్ ' తో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు మాట్లాడుతూ : 'షీ ' మూవీ కోసం తెరవెనుక కథానాయకుల ఎంపిక పూర్తి అయ్యింది..ఆసల్యం చేయకుండా ఈ నెలలోనే ఒక మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించి జనవరి , ఫిభ్రవరి నెలలో షూటింగ్ పూర్తి చేసి ఎప్రిల్ లో రిలీజ్ చేస్తామని అన్నారు.. దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మంచి కథ ,కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు..అంతేకాకుం డా ఈచిత్రాన్ని మంచి టాలెంట్ ఉన్న సాంకేతిక నిపుణులు దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు..ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలిపారు. దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మట్లాడుతూ : ఒక అందమైన ప్రేమ కథకు , హర్రర్ ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు..నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు గారు ఎంతో నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారని ..ఈ చిత్రానికి మంచి టాలెంట్ ఉన్న టెక్నిషియన్స్ దొరకడం తో చాలా ఆనందంగా ఉందని అన్నారు...ఈ కార్యక్రమంలో లైన్ ప్రోడ్యూసర్ గట్టు విజయ్ గౌడ్ , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ బసంత్ రెడ్డి పలువురు టెక్నిషిన్స్ పాల్గోన్నారు...
0 comments:
Post a Comment