.

.

తమిళనాడు వరద భాదితులకు టాలీవుడ్ సహాయం

తమిళనాడు వరద భాదితులకు టాలీవుడ్ సహాయం 

ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో ప్రస్తుతం చెన్నై మహానగరం లో ప్రత్యక్షం గా కనపడుతోంది. జనజీవనం స్తంభించిపోయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న చెన్నై నగర వాసులకు అండగా నిలవటం అవసరం. 
1. సూపర్ స్టార్ మహేష్ బాబు 10 లక్షలను విరాళంగా ప్రకటించాడు. 
2. అల్లు అర్జున్ 25 లక్షల విరాళం 
3.  ఎన్టీఆర్ 10 లక్షలు , మరియు కళ్యాణ్ రామ్ 5 లక్షలు 
 చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి  చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల  రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు. 
4. త‌మిళ‌నాడు వ‌ర‌ద భాదితుల‌కు ర‌వితేజ‌ 5 ల‌క్షల విరాళం  
ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడు మెత్తం విస్త్రుత‌మైన వ‌ర్షాల కార‌ణం గా రాష్ట్రమంతా ప్రజ‌ల తీవ్రమైన ఇబ్బందుల‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. త్వర‌లో త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత గారి సి.య‌మ్ రిలీఫ్ ఫండ్‌ కి అందించ‌నున్నారు.
5. చెన్నై వరద బాధితులకు 3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన వరుణ్ తేజ్ 
ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు. "చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయం గా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసింది గా కోరుతున్నాను", అని అన్నారు. 
6. సంపూర్నేష్ బాబు 50 వేల రూపాయల విరాళం 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment