.

.

SARC in post production

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు 



ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్  ప్రస్తుతం నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం విడుదలకు సిద్ధం గా వుంది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’.  శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రం  షూటింగ్‌ను పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రం ద్వారా అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది.  నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకి పాటలు విడుదల చేసి, సినిమాను డిశంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము.  ప్రస్తుతం మా హీరో రాజ్‌తరుణ్ నటించిన  ‘కుమారి 21 ఎఫ్’ విడుదలకు సిద్ధంగా వుంది. ఆ సినిమా టీం కి, మా హీరో కి.. అల్ ది బెస్ట్...’ అని తెలిపారు. 
 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment