‘పసంగ, మెరీనా, కేడి బిల్లా-కిలాడి రంగా’ వంటి బ్లాక్బస్టర్స్తో ‘స్టార్ డైరెక్టర్’ ఇమేజ్ సొంతం చేసుకొన్న పాండీరాజ్ దర్శకత్వంలో.. తమిళ సూపర్స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పసంగ-2. అమలాపాల్, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులు సాయిమణికంఠ క్రియేషన్స్ అధినేత జూలకంటి మధుసూదన్రెడ్డి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో ‘మేము’ అనే టైటిల్ను ఖరారు చేసారు. సూర్య మరియు కె.ఇ.జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో అతి త్వరలో విడుదల కానుండడాన్ని పురస్కరించుకొని.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను సూపర్స్టార్ సూర్య రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ .. "నేను తమిళం లో నిర్మిస్తున్న "పసంగ 2* చిత్రాన్ని "మేము" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది ఈ చిత్రంలో నేను పోషిస్తున్న పాత్ర నా కెరీర్ లొనే ఓ కలికితురాయి గా నిలిచిపోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పాండిరాజ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిస్థాత్మకంగా తెరకెక్కిస్తున్నాదు" అన్నారు.
శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్ కె.ఎల్, సంగీతం: అర్రోల్ కొర్రెల్ సమర్పణ: సూపర్స్టార్ సూర్య -కె.ఇ.జ్ఞానవేల్రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్రెడ్డి, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: పాండిరాజ్!!
0 comments:
Post a Comment