.

.

ఎన్టిఆర్ అభిమానులకు దసరా కానుక


 ఎన్టీఆర్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి అండ్‌ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం టీజర్‌ను విజయదశమి కానుకగా అక్టోబర్‌ 21 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''విజయదశమి కానుకగా 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌ని రేపు(అక్టోబర్‌ 21) సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు లండన్‌లో భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు నవంబర్‌ 1 నుంచి స్పెయిన్‌లో నెలరోజుల పాటు మరో భారీ షెడ్యూల్‌ చెయ్యబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.  
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment