.

.

దసరా కానుకగా ప్లేయర్


 ట్రిపుల్ ఎక్స్ సోప్ యాడ్ తో నటుడిగా పరిచయం అయిన పర్వీన్ రాజ్ ఇప్పుడు హీరోగా మారాడు. అతను కథానాయకుడిగా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్ పై యమున కిశోర్, జగదీశ్ కుమార్ కాళ్ళూరి 'ప్లేయర్' సినిమా నిర్మించారు. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పలు ప్రతిష్ఠాత్మకమైన కంపెనీల యాడ్స్ ను రూపొందించిన ఈ సంస్థ 'ప్లేయర్' మూవీతో చిత్ర నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టింది. కథానుగుణంగా 'ప్లేయర్' సినిమాను బ్యాంకాక్ లో చిత్రీకరించారు. తెలుగులో ఇటువంటి కథ ఇంతవరకూ రాలేదని, ఈ తరాన్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రం అనేకం ఉన్నాయని నిర్మాతలు తెలిపారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలనూ జరుపుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. కథానాయకుడిగా ఇది పర్వీన్ రాజ్ కు తొలి చిత్రమే అయినా సీనియర్ నటులు నాగినీడు, సీతతో పోటీ పడి నటించాడని, నటుడిగా అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని వారు తెలిపారు. 'ప్లేయర్' చిత్రం ద్వారా జ్ఞానసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  దసరా కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ప్లేయర్'కు చక్కని ఆదరణ అభిస్తుందనే విశ్వాసాన్ని నిర్మాతలు యమున కిశోర్, జగదీశ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment