సుకుమార్ సినిమాలో హీరోయిన్ మారింది ?
వైవిధ్యభరితమైన కథనంతో చిత్రాలను రూపొందిస్తూ క్రేజీ దర్శకుడిగా గుర్తింపు పొందిన సుకుమార్ నిర్మాతగా మారుతూ చిత్రాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారి 21ఎఫ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో షీనా బజాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ మారినట్టు సమాచారం. షీనా బజాజ్ స్థానంలో షీబా పటేల్ను ఎంపిక చేశారని తెలిసింది. ‘కరెంట్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్కు ఎక్కువ ప్రాముఖ్యత ఉందని, అందుకోసం మంచి నటన తెలిసిన అమ్మాయిని ఎంపికచేసినట్టు సమాచారం. ఇటీవలే ‘అలా ఎలా’ సినిమాలో నటించి మంచి గుర్తింపుతెచ్చుకున్న షీబా పటేల్ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికచేశారట. ఈ చిత్రంలో హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ రాజ్తరుణ్ నటిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
0 comments:
Post a Comment