ధనుష్, అమలాపాల్ జంటగా ఆర్.వేల్రాజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘వెల్లైఇల్లా పట్టదారి’ చిత్రాన్ని తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ అందిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తెలుగులో రఘువరన్ బి.టెక్ పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హీరో రామ్, శర్వానంద్, ధనుష్, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు పాల్గొన్నారు. హీరో రామ్ సీడీని ఆవిష్కరించి మరో శర్వానంద్కు అందజేశారు. అనంతరం శర్వానంద్ మాట్లాడుతూ- ఈ సినిమా నేను చూశాను. తమిళంలో పెద్ద హిట్గా నిలిచింది. ధనుష్ నటన అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఆయన ఎలాంటి సినిమాలు చేస్తారనేది ఎవరూ ఊహించలేరు. తప్పకుండా ఈ సినిమాలో తెలుగులో మంచి విజయం సాధిస్తుందన్నారు. మరో హీరో రామ్ మాట్లాడుతూ- తమిళ్లో ఈ సినిమా చూసినపుడు ధనుష్ పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పలేను. ఎందుకంటే, ఆయన జాతీయ అవార్డు పొందిన నటుడు. మంచి కథతో రూపొందిన సినిమా ఇది. పెద్దనాన్నగారు ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ధనుష్ మాట్లాడుతూ- ఈ సినిమా తెలుగులో విడుదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పుకుండా నిర్మాత రవికిషోర్గారికి మంచి హిట్ను అందిస్తుంది అన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ మాట్లాడుతూ- ఈ ఆడియో తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది ఈ సినిమా హిట్తో ప్రారంభిద్దామన్నారు.
0 comments:
Post a Comment