ఎన్టిఆర్ సినిమాలో తమన్నా !
ప్రస్తుతం ‘టెంపర్’ సినిమాతో బిజీగావున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. డిఫరెంట్ జోనర్లో ప్రజెంట్ చేసే సుకుమార్ ఈ చిత్రంతో ఎన్టీఆర్ను కొత్తగా ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పూజాహెగ్డే, రాశిఖన్నాల పేర్లు వినిపించాయి. అయితే వీరిద్దరిలో ఎవరిని తీసుకుందామనే విషయంపై సుకుమార్ ఎన్టీఆర్తో చర్చలు జరిపాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం వీరిద్దరిని కాదని మిల్క్భీమ తమన్నాను ఎంచుకున్నాడట. ఈ సినిమాలో తమన్నా అయితే బాగుంటుందని ఆయన సూచించినట్టు తెలిసింది. తమన్నాతో ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రంలో నటించాడు. తమన్నా ప్రస్తుతం బాహుబలి సినిమాలో నటిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నా నటించే క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కానుంది. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్టు సమాచారం.
0 comments:
Post a Comment