Manam Movie on april 12th
అక్కినేని నటవారసులు అందరు కలిసి నటిస్తున్న మనం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది . మూడు తరాల హీరోలు అక్కినేని , నాగార్జున, చైతన్యలు కలిసి నటించిన మనం సినిమా పాటల విడుదలకు, సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది . ఈ సినిమా పాటలు ఇప్పటికే పైరసీ కి గురైన విషయం తెలిసిందే . దాంతో నాగ్ ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే ఆడియోను ఈనెల 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాను కూడా 12న విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాగార్జున సరసన శ్రియ నటిస్తుండగా.. చైతూకి జంటగా సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు. అక్కినేని నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ కూడా నటించారనే ప్రచారం జరుగుతోంది. మరి అఖిల్ కుడా ఉన్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ?
0 comments:
Post a Comment