.

.

ఎన్టిఆర్ ఘాట్ లో మెగా హీరో ?


సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరోలకు హీరోలకు మద్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే . కొందరికి చాలా ఘాటుగా ఉంటె మరి కొందరికి లోలోపల ఉంటాయి . ఇంతకి విషయం ఏమిటంటే నిన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పుట్టినరోజు. ఆ రోజు ఉదయం నుండే ఎన్టీఆర్ ఘాట్ ఆయన కుటుంబ సభ్యులు , అభిమానులతో సందడిగా మారింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా  ఉదయం నుండే ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు . ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు కుమారులు నందమూరి హరికృష్ణతో పాటు ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, దగ్గుబాటి దంపతులుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. అయితే ఇక్కడికి మెగా హీరో ఎంట్రీ ఇవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది ? ఇంతకి ఆ హీరో ఎవరనుకుంటున్నారా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . ఈ మెగా హీరో ఇక్కడికి రావడం తో అందరిలో సందేహాలు కలిగాయి . ఎన్టిఆర్ అంటే ఇతనికి అంత అభిమానమా అని ! అక్కడ అంత లేదట , కాని అసలు విషయం ఏమిటంటే  సాయి ధరం తేజ్  దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరితో కలిసి వచ్చాడు. నందమూరికి వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి సాయి ధరం తేజ్ తో రేయ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే . అందుకనే వీరిద్దరూ వచ్చారట అది విషయం . 
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment