దేశ యావత్తు కోరుకున్నట్టు గానే నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు . రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్రపతి ఆధ్వర్యంలో 45 మంత్రులతో కనీసం రెండు గంటలపాటు సాగే ప్రమాణ స్వీకారం తర్వాత అతిథులందరికీ రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు .
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఎనిమిది సరిహద్దు దేశాల నాయకులతో పాటు 1000 మంది అతిథులు విదేశాల నుంచి, 3000 మంది దేశం నలుమూలల నుంచి విచ్చేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కాబోయే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖరరావు అక్కడికి చేరుకున్నారు . ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తదితరులు హాజరయ్యారు. congrats..........
0 comments:
Post a Comment